ఏపీ క్యాపిటల్ : ఫస్ట్ ఆప్షన్ మంగళగిరి.. సెకండ్ ఆప్షన్ నూజివీడు!

మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (10:10 IST)
రైతులు ముందుకు వస్తే విజయవాడకు అత్యంత సమీపంలో ఉన్న మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ మంగళగిరి ప్రాంతంలో రైతులు భూములు ఇవ్వడానికి ముందుకురాకపోతే నూజివీడును సెకండ్ ఆప్షన్‌గా తీసుకోవాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడకు సుమారు 17 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి ఉంది. ఇక విజయవాడ నుంచి నూజివీడుకు మధ్య దూరం సుమారు 42 కిలోమీటర్లు.

వెబ్దునియా పై చదవండి