అపార్ట్మెంట్ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రహరి గోడకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేపట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పది అడుగుల లోతు ఉన్న... గుంతలో ఆరుగురు కార్మికులు పని చేస్తుండగా... ఒక్కసారిగా ప్రహరీ గోడ, దాని కింద ఉన్న మట్టిపెళ్లలు కుప్పకూలిపోయాయి. వీటి కింద చిక్కుకున్న నాలుగు మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. మృతులను కృష్ణ, రాము, పరదేష్, సోమేష్గా గుర్తించారు. వీరంతా ఒడిశా వలస కార్మికులే. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.