నెల్లూరు జిల్లా వేదాయ పాలెంలో లక్ష్మయ్య అనే వ్యక్తి ప్రత్యేక హోదా కోరుతూ, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు గల కారణాలను తెలుపుతూ, ఓ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందులో జై ఆంధ్రప్రదేశ్... జై జై ప్రత్యేక హోదా అనే నినాదాన్ని రాశారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అందులో పేర్కొన్నారు.