విజయమ్మ, షర్మిల కూడా జంప్... వైసీపీలో జగన్ ఒక్కరే...: పల్లె వ్యాఖ్య
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (18:51 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ మోహన్ రెడ్డి తప్ప ఇక ఎవరూ మిగలరు అని ఏపీ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి అన్నారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ తీరుతో విసిగిపోయిన విజయమ్మ, షర్మిలా కూడా ఆ పార్టీలో ఉండరన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జులై నాటికి అప్ ఫైబర్ నెట్ గ్రిడ్ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు. సమాచార పౌర సంబంధాల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలో భర్తీ చేస్తామని రఘునాథరెడ్డి హామీ ఇచ్చారు.