శుక్రవారం శాసనసభలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబును మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ కలిసి రైతుల ఆందోళనపై వివరించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. రైతులకు హాని కల్గించే ఏ చర్యలను తమ ప్రభుత్వం తీసుకోదన్నారు. మచిలీపట్నం పోర్టు సిటీని మెగా ఇండస్ట్రియల్ సిటీగా మార్చాలని పట్టుదలతో ఉన్నట్లు సీఎం తెలిపారు.