అభిమానులకు ఆగ్రహం వచ్చినా, ఆనందం వచ్చినా సెలబ్రిటీలు తట్టుకోవడం చాలా కష్టం సుమీ. నిన్న ఆదివారం నాడు కాపు రిజర్వేన్ల విషయంలో పవన్ కళ్యాణ్ అస్సలు పట్టించుకోవడం లేదంటూ గుంటూరు జిల్లా రేపల్లెలో పలువురు మహిళలు రోడ్డెక్కి పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలకు నిప్పు పెట్టి మంటల్లో బూడిద చేశారు.
తాజాగా నేడు ముద్రగడ పద్మనాభం దీక్షను విరమింపజేసే విషయంలో పవన్ కళ్యాణ్ వెనుక నుంచి ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతోనే ప్రభుత్వంలోని మంత్రులు తెల్లారేసరికి ముద్రగడ వద్దకు వచ్చి చర్చలు జరిపారనీ, కాపులను బీసీల్లో చేర్చేందుకు మార్గం సుగమమైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.