వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రులు పల్లె రఘునాథ రెడ్డి, పరిటాల సునీతలు మరోమారు మాటలతో దాడి చేశారు. జగన్ కోళ్లఫారం యజమానిలాంటివాడని.. గింజలు, నీళ్లు పోసి సాకిన తర్వాత బలి తీసుకోవడం ఆయన నైజమని వ్యాఖ్యానించారు. వైకాపాలో చివరకు జగన్ మినహా ఏ ఒక్కరూ మిగలరని వారు జోస్యం చెప్పారు.