జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాజధాని నిర్మాణానికి ఎంత భూమి అవసరమో అంతే తీసుకోవాలని, అదనంగా ఒక్క ఎకరం కూడా తీసుకోవద్దని చెప్పారు. రైతుల భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తే ఆమరణ దీక్షకు సైతం సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం చట్టాలు చేసి, బలవంతంగా భూములను లాక్కుంటే రైతులకు అండగా తాను నిలుస్తానని చెప్పారు. రాజధానికి 5వేల నుంచి 8వేల ఎకరాల భూమి సరిపోతుందేమోనని తనకు ఎన్నోసార్లు అనిపించిందని... అయితే, ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం కోసం భారీగా భూమి అవసరమవుతుందేమోనని భావించానని తెలిపారు.