పవన్ అసలు విషయాన్ని వదిలేసి ఓటుకు నోటు కేసులో ఇతర విషయాలను మాట్లాడుతున్నారని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నేరుగ పట్టుబడ్డ వారిపై తన అభిప్రాయాలను గాలికి వదిలేసి సండ్ర వీరయ్య గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. పవన్ తన స్థాయికి తగిన విధంగా మాట్లాడాలని హితవు పలికారు.