పవన్ కళ్యాణ్ ట్వీట్ : చంద్రబాబు అండ్ కోకు కృతజ్ఞతలు...

శుక్రవారం, 28 ఆగస్టు 2015 (17:48 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఆయన మంత్రివర్గ సహచరులకు జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. రైతుల మనోభావాలను సానుభూతితో పరిశీలించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నార చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. 
 
అలాగే, రాజధాని నిర్మాణంలో భూసేకరణ ఆపేదిశగా అడుగులు వేస్తున్నందుకు రాష్ట్ర మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు, పి నారాయణ, ఇతర మంత్రివర్గ సహచరులందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. 
 
కాగా, పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో భూసేకరణ కోసం జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకోనున్నట్టు రాష్ట్ర మంత్రి పి.నారాయణ ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి