ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేసీఆర్కు హితవు పలికారు. జనసేన పార్టీ బలోపెతానికై పూర్తి స్థాయిలో కసరత్తు ఇంకా ప్రారంభించలేదని గురువారం అన్నారు. సమగ్ర నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది సర్వేలో పాల్గొనడానికి పవన్ నిరాకరించినట్టుగా వస్తున్న వార్తలపై పవన్ స్పందిస్తూ ఆ రోజు తాను నగరంలో లేనని అన్నారు.
కాగా గురువారం రాత్రి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది. అయితే, ఈ విషయాలని తగిన సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ మీడియాతో అన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి స్టార్ కంపైనర్గా వ్యవహరించిన పవన్ తాజాగా అమిత్ షాతో భేటీ అవడం పలు చర్చలకు దారి తీస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం.