ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడితో, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. హైదరాబాదులో ఆదివారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో నవ్యాంధ్ర రాజధాని కోసం జరుగుతున్న భూ సమీకరణపై సీఎం వద్ద పవన్ ప్రస్తావించినట్టు సమాచారం.
ఈ సందర్భంగా ఇరువురు భూ సమీకరణపై చర్చలు జరిపారట. ప్రభుత్వం తమ నుంచి బలవంతంగా భూములను లాక్కుంటోందని జనసేన కార్యకర్తలు ఇటీవల ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో ఆదివారం బాబుతో పవన్ సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. భూ సమీకరణతో పాటు కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే, సాధారణ బడ్జెట్లు, తాజా రాజకీయ పరిణామాలపైనా వారిద్దరూ ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.