కరువుకు నిలయంగా మారుతున్న అనంతపురం జిల్లా భూమిలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు, మూడేళ్ల కిందటి వరకూ భూమిలో పొగలు వెలువడితే... ప్రస్తుతం ఏకంగా భూమి కిందకు కుంగిపోయింది. ఇంతా అంతా కాదు. ఏకంగా 30 అడుగుల లోతులోకి భూమి కుంగిపోవడంతో చుట్టుపక్కల సంచరించే జనం భయాందోళనలకు గురవుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.
చిత్రావతి నదిలో రెండు దశాబ్దాలు నీరు ప్రవహించడం లేదు. పూర్తిగా ఎండిపోయింది. దీనికి తోడు వర్షాభావం కూడా అనంతపురం జిల్లాలో చాలా తక్కువగా ఉంది. నిత్యం కరువు పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో భూమి కింద భాగంలో గాలి నెర్రెలు ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. ఈ గాలి నెర్రెల కారణంగా భూమి ఒక్క సారిగా కిందకు కుంగిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంపై అనంతపురం జిల్లాలో కొన్నేళ్ళుగా భూమిలో మార్పులు వస్తున్నాయి.