పెథాయ్ తుఫాన్ వార్నింగ్... ఏపీలో భారీ వర్షం పడే ప్రాంతాలివే....

సోమవారం, 17 డిశెంబరు 2018 (11:43 IST)
ఏపిలో పెథాయ్ తుపాన్ తూర్పుగోదావ‌రి జిల్లా ద‌క్ష‌ణ అమ‌లాపురం, తాళ్ల‌రేవు - యానం మ‌ధ్య  తీరం దాట‌నుంది. ఇది ఈ రోజు మ‌ధ్యాహ్నం 12.00 నుంచి సాయంత్రం 4.30 గంట‌ల‌లోపు తీరం దాటుతుంది. మ‌రో గంట‌లోపు తూర్పు గోదావ‌రి జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 
 
రాజోలు, స‌ఖినేటిప‌ల్లి, అమ‌లాపురం, మ‌లికిపురం, అంబాజీపేట‌, మామిడికుదురు, అల్ల‌వ‌రం, ఖాట్రేనికోన, ఉప్ప‌ల‌గుప్తం మండ‌లాల్లో మ‌రో గంట‌లో కుండ‌పోత వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయి. ఈ ప్రాంత ప్ర‌జ‌లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌గా ఉండాలని ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు