బల్క్ డ్రగ్ మేనిఫాక్చర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో బుధవారం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రత్యేక ఫార్మా సిటీని నెలకొల్పేందుకు 5 వేల ఎకరాల స్థలం అవసరమని సీఎంకు ఫార్మా ప్రతినిధులు తెలిపారు. ఫార్మా కంపెనీల కోసం ప్రత్యేక సెక్రటరీని నియమించాలని కోరగా, దీనికి సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు.