సిరంజి సైకో తన పంథా మార్చుకున్నాడు. తనను చూసి అమ్మాయి నుంచి అమ్మమ్మ వరకూ భయపడి పారిపోతుంటే, పురుషులకు సూదిపోట్లు పొడవడం మొదలెట్టేశాడు. ఆదివారం మధ్యాహ్నం ఓ పురుషుడిపై సూదితో దాడి చేశాడు. వివరాలిలా ఉన్నాయి.
ఆ వ్యక్తిని 108 అంబులెన్సులో తాడేపల్లి గూడెం ఆసుపత్రికి తరలించారు. కాగా, సూదిగాడి ఉన్మాదానికి గురైన బాధితుల సంఖ్య 16కి చేరినట్టు సమాచారం. పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నా అతగాడు దొరక్కపోవడంతో ప్రజల్లో భయం రాజ్యమేలుతోంది.