ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వేగంగా మంటలు అంటుకోవడంతో బస్సులోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన నూతన దంపతులు నికేష్ హేమాద్రి, కళ్యాణికి చెందిన రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్, నగదు అగ్నికి ఆహుతైనట్టు వారు బోరున విలపిస్తూ చెప్పారు.