విభజన వల్ల తీవ్రంగా నష్టంపోయిన ఏపీకి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రం ఆర్థిక లోటుతో ఉందని... లోటు భర్తీకి కేంద్రం సహకరించాలని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఈనెల 7న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్టు ఫోరం అధ్యక్షుడు కృష్ణాంజనేయులు, కార్యదర్శి వంశీ ఈ సందర్భంగా తెలిపారు.
శనివారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీది ప్రత్యేక పరిస్థితన్నారు. గత పాలకులు అసమగ్ర విభజన చేసి రాష్ట్రాన్ని నష్టాల్లోకి నెట్టారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అన్ని రాష్ట్రాలతో సమానంగా పోటీపడే స్థాయి వచ్చే వరకూ కేంద్రం సహకరించాలని కోరారు. ఈ క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.