బాపట్ల లాడ్జిలో పట్టుబడ్డ సినీ నిర్మాత... వ్యభిచారం చేస్తున్న ఇద్దరు మహిళలు కూడా...

మంగళవారం, 19 మే 2015 (21:58 IST)
గుంటూరు జిల్లా బాపట్ల లాడ్జిలపై మంగళవారం నాడు పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 17 మంది పేకాటరాయుళ్లు దొరికిపోయారు. ఈ పేకాటరాయుళ్లలో సినీ నిర్మాత కొరటాల సందీప్, తెలుగుదేశం పార్టీకి చెందిన మువ్వా హరీశ్ కూడా ఉండటంతో కలకలం రేపుతోంది. వీరి వద్ద భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరోవైపు ఇదే లాడ్జిలో వ్యభిచారం కూడా జరుగుతోంది. నలుగురు విటులు, ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు. సినీ నిర్మాత కొరటాల సందీప్ పట్టుబడటం చర్చనీయాంశమైంది.

వెబ్దునియా పై చదవండి