దేశంలోని వ్యభిచారకూపాల్లో 95 శాతం అమ్మాయిలు తెలుగువారేనట!

ఆదివారం, 2 ఆగస్టు 2015 (13:20 IST)
దేశ వ్యాప్తంగా వ్యభిచారకూపాల్లో (రెడ్‌లైట్ ఏరియా) ఉండే అమ్మాయిల్లో 95 శాతం తెలుగు యువతులేనని ఉన్నారని ప్రజ్వల అనే స్వచ్చంధ సంస్థ తాజాగా వెల్లడించింది. ఇదే అంశంపై ఆ సంస్థ ప్రతినిధి సునీతా కృష్ణన్ మాట్లాడుతూ.. గత నెలలో మహారాష్ట్రలోని చాందీపూర్‌లో వ్యభిచార గృహాలపై తెలంగాణ సీఐడీ అధికారులు దాడులు చేసి 64 మందిని రక్షించారన్నారు.
 
 
ఇదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఉన్న వ్యభిచారకూపాల్లో తెలుగు అమ్మాయిలు ఉన్నట్టు చెప్పారు. వీరిని కాపాడేందుకు తమ సంస్థ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కూపాల్లో చేరుతున్న వారంతా హ్యూమన్ ట్రాఫికింగ్ లో భాగంగా ఆయా ప్రాంతాలకు అక్రమంగా చేర్చబడ్డారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులో ఉన్న పేద అమ్మాయిలకు వల వేసే కొందరు దుర్మార్గులు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి