నల్లని రంగులో ఉన్న పల్సర్, షైన్ బైకులు కనిపిస్తే వారిని పూర్తిగా తనిఖీలు చేసి వివరాలు అడిగి తెలుసుకున్నాకనే విడిచిపెడుతున్నారు. కాగా, బాధితులు చెప్పిన వివరాలతో అనుమానితుడి ఊహాచిత్రాన్ని గీయించిన పోలీసులు దాన్ని విడుదల చేశారు. మరోవైపు.. జిల్లా వ్యాప్తంగా గట్టిబందోబస్తు చర్యలు చేపట్టారు.