ఆరో తరగతి చదువుతున్న వైష్ణవి స్వస్థలం మెదక్ జిల్లా ఇస్లాంపూర్. వైష్ణవి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి మార్చురీకి తరలించారు. గత ఆరు రోజులుగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైష్ణమృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ప్రశాంత్, వరుణ్ గౌడ్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. నితూష, శరత్ల పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పారు. మిగిలిన 14మంది చిన్నారులు కోలుకుంటున్నారు. కాగా, యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి తరుణ్ (7) సోమవారం మృతి చెందాడు.