రైల్వే బడ్జెట్ 2015-16లో భాగంగా కాజీపేట- విజయవాడ మధ్య మూడోలైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. కాగిత రహితంగా సరకు నిల్వల నిర్వహణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఆర్పీఎఫ్ బలగాలకు యోగాశిక్షణ ఇస్తామన్నారు. రైల్వే ప్రాంగణాల్లో జల సంరక్షణ చర్యలు, రైల్వేల్లో విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకుంటామన్నారు.