పెంచిన జీతాలు వ‌ద్దంటున్న ఉద్యోగుల‌ను ఇక్క‌డే చూస్తున్నా...

సోమవారం, 24 జనవరి 2022 (16:16 IST)
రాజమండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఏపీలో ఉద్యోగుల ఉద్య‌మంపై విమ‌ర్శ‌లు చేశారు. కొత్త పి.ఆర్.సి. వ‌ద్దు అంటూ ఉద్య‌మిస్తున్న ఉద్యోగులు అవివేక‌వంతుల‌న్న‌ట్లు ఆయ‌న పేర్కొంటున్నారు. జీతాలు పెంచాం అని ప్ర‌భుత్వం అంటుంటే, పెంచిన‌వి మాకొద్దని, పాత జీతాలే కావాల‌ని ప్రభుత్వోద్యోగులంటున్నార‌ని ఎద్దేవా చేశారు. 
 
 
కొత్త పీఆర్సీ అమలు చేయటం వల్ల రూ. 10,247 కోట్లు అదనపు భారం పడుతుందని ప్రభుత్వం చెబుతుంటే, పెంచిన జీతాలు వద్దు పాత జీతాలే చాలు అంటూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగిన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు చేపట్టిన ఉద్యమంపై స్పందించిన ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా బీభత్సం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక దుస్థితిని దృష్టిలో పెట్టుకొని సమ్మెను ఆపవల్సిందిగా ప్రార్థిస్తున్నానని అన్నారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పట్టింపులకు పోకుండా చర్చలు ద్వారా సమస్యకు పరిష్కరం సాధించాల్సిందిగా కోరుతున్నానన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు