సీఎం కేసీఆర్ ఆదివారం తన కేబినెట్ నుంచి ఉప ముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ చేసి, ఆయన స్థానంలో కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ విపక్షాల నుంచి మొదలైన విమర్శల జడివాన రోజురోజుకూ ఉధృతమవుతోంది.
మరోవైపు తాము చేసిన పొరపాటు ఏమిటో తేల్చాలని, తప్పకుండా విచారణ జరిపించాలని ఉద్వాసనకు గురైన ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు విజ్ఞప్తి చేశారు. విచారణ జరిపితే కడిగిన ముత్యంలా బయటికి వస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం రాజయ్య ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.