రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల దాఖలు గడువు సమీపిస్తున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపిక ఇప్పటివరకు ఒక స్పష్టత రాలేదు. రాష్ట్రంలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతుండగా ఇందులో తెలుగుదేశం పార్టీ గెలుచుకునే బలం మూడు స్థానాలకు మాత్రమే ఉంది. కానీ నాలుగు స్థానాలను గెలుచుకోవాలని టీడీపీ పావులు కదుపుతోంది.
ప్రస్తుతం సాగుతున్న ప్రచారం మేరకు చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే హేమలత పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. అయితే, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ కూడా ఈ సీటును ఆశిస్తున్నట్టు సమాచారం. దీంతో చంద్రబాబు ఎవరికి కేటాయిస్తారన్న అంశంపై సందిగ్ధత నెలకొంది.