పుష్కరాల చివరి రోజు విజయవాడలో విషాదం... నలుగురు మృతి

మంగళవారం, 23 ఆగస్టు 2016 (15:18 IST)
విజయవాడ : పుష్కరాల చివరి రోజు విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి విశాఖ వెళుతుండగా, కారు డివైడర్‌ను ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో న‌లుగురు మృతి చెందారు. మరో ఇద్ద‌రి పరిస్థితి విషమంగా ఉంది. పుష్కర స్నానం చేసి విశాఖకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు నెంబర్‌ ఏపీ 30పీ 4789గా పోలీసులు గుర్తించారు.

వెబ్దునియా పై చదవండి