పట్టపగలే తలపై మోది.. నగలు వలుచుకుని... తిరుపతిలో మహిళ హత్య

శనివారం, 20 డిశెంబరు 2014 (13:36 IST)
పట్టపగలు.. వేలాది మంది తిరిగే విశ్వవిద్యాలయం.. దొంగలు కాలనీపై విరుచుకుపడ్డారు. ఓ మహిళ తలపై మోది.. గొంతు గాయం చేసి.. నగలు వలుచుకుని హత్య చేశారు. అనంతరం తాపీగా పరారయ్యారు. ఈ సంఘటన తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని కాలనీలో చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
యూనివర్సిటీ ఏఏఓ శివశంకర్ భార్యను హత్యచేశారు. క్యాంపస్లోనే ఏఏఓగా పనిచేస్తున్న ఆయన క్వార్టర్స్లో ఉంటారు. ఆయన కార్యాలయానికి వెళ్ళారు. భార్య సుధ, కుమారుడు మాత్రమే ఉన్నారు. కుమారుడు కూడా 11.30 గంటల ప్రాంతంలో బయటకు వెళ్ళారు. విషయం గమనించిన దుండగులు వెనకవైపు నుంచి ఒక్కసారిగా  దాడి చేశారు. ఆమెను హతమార్చి, ఆమెవద్ద ఉన్న నగలు దోచుకుని వెళ్లిపోయారు.
 
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రిలో చేర్పించేందుకు ప్రయత్నించగా మార్గమధ్యలో మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాగిలాలు దుండగలు జాడ కనుక్కోవడానికి పక్కనే ఉన్న అగ్రికల్చరల్ యూనివర్శిటీ వరకూ మాత్రమే జాడలు గుర్తించాయి.

వెబ్దునియా పై చదవండి