యూనివర్సిటీ ఏఏఓ శివశంకర్ భార్యను హత్యచేశారు. క్యాంపస్లోనే ఏఏఓగా పనిచేస్తున్న ఆయన క్వార్టర్స్లో ఉంటారు. ఆయన కార్యాలయానికి వెళ్ళారు. భార్య సుధ, కుమారుడు మాత్రమే ఉన్నారు. కుమారుడు కూడా 11.30 గంటల ప్రాంతంలో బయటకు వెళ్ళారు. విషయం గమనించిన దుండగులు వెనకవైపు నుంచి ఒక్కసారిగా దాడి చేశారు. ఆమెను హతమార్చి, ఆమెవద్ద ఉన్న నగలు దోచుకుని వెళ్లిపోయారు.