పాలన గాలికి వదిలేసి రాజధాని భూముల చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రానికి ఉన్న పరువును, గుర్తింపును కుక్కలు చింపిన విస్తరి చేశారని మండిపడ్డారు. రాయలసీమకు గుండెకాయలాంటి హంద్రినీవాను త్వరితగతిన పూర్తి చేయాలని రోజా డిమాండ్ చేశారు.