రోజా ఫైర్: పాలన గాలికి వదిలేసి.. విమానాల్లో చక్కర్లు కొడుతూ..!

గురువారం, 29 జనవరి 2015 (12:39 IST)
ఏపీ సీఎం చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పిన బాబు... మరోవైపు ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరగడం అవసరమా అని ప్రశ్నించారు. 
 
పాలన గాలికి వదిలేసి రాజధాని భూముల చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రానికి ఉన్న పరువును, గుర్తింపును కుక్కలు చింపిన విస్తరి చేశారని మండిపడ్డారు. రాయలసీమకు గుండెకాయలాంటి హంద్రినీవాను త్వరితగతిన పూర్తి చేయాలని రోజా డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి