విజయవాడలోని ఎం.జి. రోడ్లోని పివీపీ స్క్వేర్ను శుక్రవారం నాడు సచిన్ టెండూల్కర్ ప్రారంభించారు. అనుష్క ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పివీపీ బేనర్పై 'బలుపు' చిత్రాన్ని నిర్మించిన పొట్లూరి వి.ప్రసాద్ తొలిసారిగా విజయవాడలో మల్టీప్లెక్స్ థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్లను నిర్మించారు. గత కొద్దిరోజులుగా సచిన్ వస్తున్నాడనే ప్రచారంతో విజయవాడలో యూత్ బాగా హాజరయ్యారు. ఓ దశలో వారిని కంట్రోల్ చేయడం కష్టమైంది.