భారతరత్న, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఏపీ రాజధానిపై వాకబు చేశారు. విజయవాడ నగరం గురించి మాస్టర్ ఆరా తీశారు. నగరంలో శుక్రవారం పీవీపీ మాల్ ప్రారంభోత్సవ కార్యాక్రమానికి అతడు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా తాను 20 ఏళ్ల కిందట క్రికెట్ ఆడటానికి వచ్చానని, అప్పటి బెజవాడకు, ఇప్పటికి ఉన్న తేడాను గమనిస్తూ సచిన్ ...పీవీపీని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం విడిపోయాక పరిస్థితులు, కొత్త రాజధానిపై సచిన్ ఆరా చేసినట్లు సమాచారం.