పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించిన సల్మాన్ ఖాన్ తండ్రి!

సోమవారం, 26 జనవరి 2015 (16:59 IST)
భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించేందుకు బాలీవుడ్ రచయిత, నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తిరస్కరించారు. తన హోదాకు, చేస్తున్న పనికి ఆ అవార్డు సరిపోదని అన్నారు.

చాలా ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం నన్ను నిర్లక్ష్యం చేసిందని వాపోయారు. సినీ పరిశ్రమలో నా సహచరులు, నాకన్నా జూనియర్‌లను పద్మ పురస్కారంతో గౌరవించిందన్నారు.
 
పద్మ అవార్డుల జాబితాలో నా పేరు ఉందని నాకు మూడు రోజుల క్రితమే తెలిసింది. అప్పుడే అనుకున్నా నేను పొందాల్సిన దాని ఎట్టకేలకు సాధించానని తెలిపారు. కానీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నన్ను పద్మశ్రీకి ఎంపిక చేసిందని తెలియగానే అతి నాకు తగింది కాదని భావించానని చెప్పారు.
 
అయితే కేంద్ర ప్రభుత్వం తనను గుర్తించి అవార్డు ప్రకటించింనందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం తనను పక్కనబెట్టిందని ఆవేదనను కూడా వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి