గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ప్రభుత్వం నిర్మించిన మరుగుదొడ్లు రికార్డుకెక్కాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సత్తెనపల్లిలో 20 వేల మరుగుదొడ్లు నిర్మించడం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం లభించింది. ఈ విషయంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ మాట్లాడుతూ.. సత్తెనపల్లిలో 20 వేల మరుగుదొడ్లు పూర్తిచేసి లిమ్కా బుక్లో చోటు సంపాదించడం సంతోషకరమన్నారు.