అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిపై అనుచిత ప్రవర్తన!

శనివారం, 1 నవంబరు 2014 (14:34 IST)
అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిపై టీచర్ మండిపడ్డారు. కర్నూలు జిల్లాలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో అయ్యప్పమాల ధరించిన విద్యార్థి పట్ల టీచర్‌ అనుచితంగా ప్రవర్తించాడు. ఆరోతరగతి చదువుతున్న మణికంఠ అనే విద్యార్థి అయ్యప్ప మాల ధరించాడు. 
 
మాల ధారణతో స్కూలు వెళ్లిన విద్యార్థిని పీఈటీ టీచర్‌ విప్పించి మరో డ్రెస్‌ వేయించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, అయ్యప్ప భక్తులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. 
 
విద్యార్థితో టీచర్‌ అనుచితంగా ప్రవర్తించారంటూ ఆరోపించారు. పాఠశాల ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. స్కూల్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

వెబ్దునియా పై చదవండి