సర్పంచులది ఆకలి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం!

సోమవారం, 2 మార్చి 2015 (09:43 IST)
సర్పంచులది ఆకలి పోరాటం కాదని, ఆత్మ గౌరవ పోరాటమని సమస్యలపై అసెంబ్లీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎమ్మెల్యేలు ఎన్‌వీఎస్‌ఎస్. ప్రభాకర్, ఆర్.కృష్ణయ్యలు అన్నారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. 
 
సర్పంచుల సంఘం అధ్యక్షుడు మల్లేపల్లి సోమిరెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ప్రభాకర్, కృష్ణయ్యలు మాట్లాడుతూ సర్పంచులకు కనీస గౌరవ వేతనం రూ. 20వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి ఓటు హక్కు కల్పించాలని, ఆదాయంలో 42 శాతం పంచాయతీలకు కేటాయించాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు జాయింట్ చెక్‌పవర్‌ను తీసివేసి, నిధుల వినియోగంలో సర్పంచులకు స్వేచ్చ కల్పించాలని వారు కోరారు.

వెబ్దునియా పై చదవండి