మధ్యాహ్నం అయితే సరే శేషాచలం అడవుల్లో మంటలు వ్యాపిస్తున్నాయి. మూడు రోజులకు ముందు కపిలతీర్థం సమీపంలోని మాల్వాడి గుండంపై మంటలు వ్యాపించి, నాలుగు గంటలకుపైగా అడవులు కాలుతూనే ఉన్నాయి. అయితే అటువైపు వెళ్ళేందుకు అగ్నిమాపక సిబ్బందికి దారి లేకపోవడంతో చేతులెత్తేశారు. వాతావరణం చల్లబడే కొద్దీ ఆ మంటలు కూడా తగ్గుముఖం పడ్డాయి. మంటలు ఆరిపోయాయిలే అనుకున్న సమయానికి శుక్రవారం మధ్యాహ్నం నుంచి తిరిగి మంటలు చెలరేగాయి.