ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా సరే కడపలో సంబరాలు మొదలవుతాయి. అక్కడ నుంచి పందేలు జోరుగా సాగుతాయి. దేశంలో ప్రముఖ బుకీలందరికీ ఇక్కడి చోటా మోటా బుకీలతో సంబంధాలుంటాయి. వందలు వేలు కాదు. లక్షల్లో పందేలు జరుగుతాయి. ఇక్కడ రాత్రి రాత్రే కోటీశ్వరులు అయిన వారూ ఉన్నారు. ఒక రాత్రి తేడాతోనే బికారులుగా రోడ్డున పడ్డ వారూ ఉన్నారు. తాజాగా పోలీసులు ఏడుగురు బుకీలను అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.
దీంతో అర్బన్ పోలీసులు సదరు కాంప్లెక్స్పై దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.54 లక్షల నగదు, ఏడు సెల్ఫోన్లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. కాగా ప్రధాన బుకీ నాగేంద్ర పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.