క్రైమ్ సీరియల్ ను తలపిస్తోన్న షీనా కేసులో తాజాగా మరో విషయం బయటపడింది. ఆమె సెల్ ఫోన్ నుంచి ఆరు మెస్సేజ్లు తన బోయ్ ఫ్రెండ్కు వెళ్ళాయి. 2012, ఏప్రిల్ నెలలో షీనా హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నా.. ఆ తరువాత ఆమె సొంత మొబైల్ ఫోన్ నుంచి తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ ముఖర్జీయాకు ఆరు మెస్సేజ్ లు వచ్చాయట. ఇది పోలీసుల బుర్రలను తొలచి వేస్తోంది.