సిరంజితో మహిళలపై దాడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్న సైకో విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. అతగాడిని పట్టుకోవడానికి ఇంకా ఎంత కాలం కావాలంటూ మండిపడడంతో పోలీసు ఉన్నతాధికారులే నేరుగా రంగంలోకి దిగారు. అతనిని పట్టుకోవడానికి పరుగులు పెడుతున్నారు. సిరంజిలతో గాయపరుస్తున్న సైకో ఊహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు.
సైకోను పట్టుకోవడానికి 40 బృందాలని నియమించారు. దీనిపై గురువారం అడిషినల్ డీజీ ఆర్పీ ఠాగూర్, ఐజీపీ విశ్వజిత్ బాధితులతో మాట్లాడారు. బాధిత మహిళలు చెప్పిన ఆన వాళ్ళ ఆధారంగా సైకో ఊహాచిత్రాన్ని రూపొందించారు. నరసాపురం డీఎస్పీ పి.సౌమ్యలత శుక్రవారం భీమవరంలో నిందితుడి ఊహాచిత్రాన్ని మీడియాకు అందజేశారు.