రాష్ట్రం.. రాష్ట్ర అభివృద్ధి గురించి భారతీయ జనతాపార్టీలో నాయకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సినీ నటుడు శివాజీ ఆరోపించారు. ఆ పార్టీలో కొందరు సిల్లీ, గల్లీ నాయకులు ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ప్రత్యేక హోదాపై భారతీయ జనతాపార్టీ అధిష్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. అయితే ప్రత్యేక హోదా సాధించేంత వరకూ పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు. శనివారం ఉదయం ఆయన ప్రత్యేక హోదాపై సీపీఐ ఏర్పాటు చేసిన బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.