ఈమె తన ఉపన్యాసం ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య, మంత్రిమండలి సహచరుడు సుజనా చౌదరిలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, తన మాటలను తెలుగులోకి ఎవరైనా తర్జుమా చేయగలరా? అని కోరారు. అయితే, అందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇంగ్లీషులోనే కొనసాగించారు.
అనంతరం రాష్ట్ర విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ఏపీని ఎడ్యుకేషన్ హబ్గా చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు కల అని ఉద్ఘాటించారు. నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక, ఒకే చోటు మూడు విద్యాసంస్థలకు ఏకకాలంలో భూమి పూజ ఇదే ప్రథమమని తెలిపారు.