హైదరాబాద్కి చెందిన భవ్యశ్రీ చరిత అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత కొద్ది రోజుల క్రితం అదృశ్యం కాగా, పోలీసులు ఆమెకోసం తీవ్రంగా గాలించడం, ఆ తర్వాత ఆమె తాను సొంతగానే వైజాగ్ వెళ్ళిపోయానని చెప్పడం తెలిసిందే. జనం ఇంకా ఆ సంఘటన గురించి మరచిపోకముందే హైదరాబాద్ నగరంలో మరో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యమైంది.
దీంతో కుటుంబ సభ్యులు నగరంతో పాటు బంధు, మిత్రుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ దొరకకపోవడంతో గురువారం రాత్రి అఫ్జల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి, ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.