కృష్ణపట్నంలో హక్కా.. అయితే హైదరాబాద్ సంగతేంటి కేసీఆరూ..?

శనివారం, 25 అక్టోబరు 2014 (12:44 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో కృష్ణపట్నంలో తమ పెట్టుబడులున్నాయని చెబుతున్న కేసీఆర్‌.. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల పెట్టుబడులపై మాట్లాడరెందుకని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. 
 
కృష్ణపట్నంలో వాటా కోరే కేసీఆర్, హైదరాబాద్‌లో ఆదాయాన్ని సీమాంధ్రకు పంచి ఇస్తారా? అని సోమిరెడ్డి అడిగారు. విద్యుదుత్పత్తి విషయంలో సుప్రీంకోర్టుకు వెళతానంటున్న కేసీఆర్ ను తామేమీ ఆపడం లేదని ఈ సందర్భంగా సోమిరెడ్డి అన్నారు.

వెబ్దునియా పై చదవండి