రాష్ట్ర విభజనలో భాగంగా కమిటీ హాలు తెలంగాణకు వెళ్లిందని చెప్పారు. అసెంబ్లీ, జనరల్ పర్పస్ కమిటీ అనుమతులు లేకుండా ఎవరి ఫొటోను పెట్టలేమని అన్నారు. గతంలో వైయస్ ఫొటో పెట్టినప్పుడు ఆ నిబంధనను పాటించలేదని చెప్పారు.
ఈ విషయాలన్నింటినీ పట్టించుకోకుండా కేవీపీ తనకు లేఖ రాసి, సభను కించపరిచారని కోడెల వ్యాఖ్యానించారు. కేవీపీ రాసిన లేఖను మీరు సమర్థిస్తారా? అంటూ వైకాపా సభ్యులను స్పీకర్ ప్రశ్నించారు. వైఎస్సార్ ఫోటో పడిపోయేలా ఉంటే దాన్ని తీసి భద్రపరచమని నేనే చెప్పానని కోడెల అన్నారు. కమిటీ హాలులోనే సీఎం ఫోటోలు పెట్టాలని.. అలా పెట్టాల్సి వస్తే సంవత్సరాల వారీగా అప్పటి సీఎం ఫోటోలు పెట్టాలన్నారు.