కిడ్నాపైన 7వ తరగతి విద్యార్థి దారుణహత్య...నలుగురు అరెస్టు

శుక్రవారం, 28 నవంబరు 2014 (09:46 IST)
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం బాటసింగారంలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఉదయ్ కిరణ్ దారుణహత్యకు గురయ్యాడు. కిడ్నిప్ చేసిన దుండగులు విద్యార్థిని గొంతునులుమి హత్య చేశారు. 
 
గత గురువారం నుంచి కనిపించకుండా పోయిన ఉదయ్ వనస్థలిపురం చింతలకుంట చెరువులో శవమై తేలాడు. రంగంలోకి దిగిన సరూర్ నగర్ పోలీసులు మాజీ హోంగార్డుతోపాటు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 
 
నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ తగాదాలే కారణమని పోలీసుల ప్రాధమిక విచారణలో తెలిసింది. పోలీసలు కేసు నమోదు చేసుకుని తీవ్ర విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి