తెలంగాణ సచివాలయంలో గురువారం తనకు ఎలాంటి అవమానం జరగలేదని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఢిల్లీలోని తన కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పారని, ఆ విషయం తనకు చేరే లోపే తాను సచివాలయానికి చేరుకున్నానని తెలిపారు.
కాగా, రెండు రోజుల క్రితం సుజనా చౌదరి కేసీఆర్ కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. కేసీఆర్ లేకపోవడంతో ఆయనను కలవకుండానే వెనుదిరిగారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీజలాలు, ఎంసెట్ తదితర సమస్యలు సామరస్యంగానే పరిష్కరావుతాయని చెప్పారు.