తిరుమలలో నిత్యానంద... రంజితతో కలిసి వీఐపి దర్శనం... భక్తుల నోటిపై వేళ్లు

శనివారం, 12 మార్చి 2016 (12:16 IST)
ఈమధ్య వివాదాస్పద గురువు నిత్యానంద వరుసబెట్టి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. మొన్న శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న నిత్యానంద-రంజిత నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి విరామ దర్శనా సమయంలో నిత్యానందస్వామి, నటి రంజితలు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. 
 
నిత్యానంద, రంజితలను చూసిన భక్తులు నోటిపై వేళ్లేసుకున్నారు. ఇక్కడ కూడా నిత్యానందస్వామి శిష్యబృందం టిటిడి అధికారులతోపాటు భక్తులపైన కూడా దురుసుగా ప్రవర్తించారు. నిత్యానందతో కరచాలనం చేసేందుకు భక్తులు రాగా వారిని పక్కకు నెట్టేశారు ఆయన శిష్యులు. శ్రీవారి దర్శనం తరువాత తిరుమల నుంచి నేరుగా తిరుపతికి వచ్చేశారు నిత్యానంద స్వామి.

వెబ్దునియా పై చదవండి