జంటనగరాల్ని పట్టి పీడిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి!

శుక్రవారం, 30 జనవరి 2015 (14:03 IST)
స్వైన్ ఫ్లూ మహమ్మారి జంట నగరాల్ని పట్టి పీడిస్తోంది. వైద్యులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ  స్వైన్ ఫ్లూ కేసులు తగ్గుముఖం పట్టట్లేదు. ఈ నెలలో స్వైన్ ఫ్లూతో మరణించిన వారి సంఖ్య 28కు చేరింది.
 
ఉస్మానియా ఆసుపత్రిలో 12 మంది వైద్యులకు స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రి వర్గాలు ఖంగుతిన్నాయి. వారికి ఆసుపత్రి సూపరిండంట్ అయిదు రోజుల పాటు సెలవు మంజూరు చేసి ఇంట్లోనే చికిత్స తీసుకోవాలని సూచించారు.

వెబ్దునియా పై చదవండి