ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన సమయంలో ఇచ్చిన హామీల మేరకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీని దేవుడైనా రక్షించాలి, లేదా కేంద్రమైనా ఆదుకోవాలి అని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తారంటూ ఏపీ ప్రజలంతా ఎదురుచూస్తున్నారని, దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.