ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో హవాలా నడిపిన మంత్రి నారాయణకు కార్పొరేట్ శక్తులకు లబ్ది చేకూర్చడమే లక్ష్యమా అని నిలదీశారు. రాజధాని ఎంపికలో నారాయణ కమిటీ నివేదిక ప్రజల్లో అనుమానాలకు దారితీసేలా ఉందని తప్పుబట్టారు. 60 అంతస్తుల భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే ఇన్ని వేల ఎకరాలు సేకరించడం ఎందుకని తమ్మినేని సీతారాం విమర్శించారు.